English | Telugu

నాగ్ "డమరుకం" మార్చ్ 27 న రిలీజ్

వారణాశి పూర్తి, దేవీశ్రీ ప్రసాదద్, చోటా.కె.నాయుడు, ఆర్ ఆర్ మూవీ మేకర్స్, శ్రీనివాసరెడ్డి, సోషియో ఫంటసీ, 50 కోట్ల భారీ బడ్జెట్, నాగ్ "డమరుకం" మార్చ్ 27 న రిలీజ్ కానుంది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, యువసామ్రాట్ , కింగ్ నాగార్జున హీరోగా, అనుష్క హీరోయిన్ గా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న చిత్రం"డమరుకం". ఈ "డమరుకం" చిత్రాన్ని 50 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ "డమరుకం" చిత్రంలో కోసం కోట్లాది రూపాయల సెట్స్ ఇప్పటికే ఆరు వేశారు. ఇంకా ఎన్ని వేస్తారో అంచనా లేదు.

ఈ "డమరుకం" చిత్రంలో 50 నిమిషాల పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయట. ఇది హీరో నాగార్జున సినీ జీవితంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.దీన్లో ఆయన రకరకాల గెటప్స్ తో కనిపిస్తారట. ఇటీవలే ఈ చిత్రం కోసం పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాశి అంటే కాశికి వెళ్ళి అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూండగా, చోటా.కె.నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ "డమరుకం" వేసవి శలవుల కానుకగా మార్చ్ 27 వ తేదీన విడుదల కానుంది.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.