English | Telugu

రామయ్యను థ్రిల్ చేసిన సుకుమార్

మహేష్ బాబుతో "1-నేనొక్కడినే" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగానే సుకుమార్ మరో చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ కు సుకుమార్ ఓ కథ వినిపించడంట. ఆ కథ విని ఎన్టీఆర్ చాలా థ్రిల్ ఫీలయ్యాడని తెలిసింది. దాంతో ఎన్టీఆర్ వెంటనే సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబుతో "1-నేనొక్కడినే" చిత్ర షూటింగ్ లో సుకుమార్, "రామయ్యా వస్తావయ్యా" చిత్ర షూటింగ్ లో ఎన్టీఆర్ లు బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.