English | Telugu

ఏమైన రాసుకోండి... నవ్వుకుంట...!

సెలబ్రేటిలు అన్నాక రూమర్స్ వంటి వార్తలు రావడం సహజమే. అయితే సినీ తరాలకు మరి ఎక్కువగా రూమర్స్ వస్తుండటంతో తనకు కూడా అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చింది బాలీవుడ్ చిన్న పాప ఆలియాభట్.

ఇటీవలే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు... సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలో తనకు అర్థమైపోయిందని అంటుంది. గత కొద్దిరోజులుగా ఈ అమ్మడు డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వీటిపైన వస్తున్న వార్తలను చూసి నవ్వుకుంటానని తెలిపింది. అర్థం లేని వాటి గురించి ఎవరు ఏం రాసిన కూడా పట్టించుకోనని చెప్పేసింది. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే అందరికి తెలిసేలా ధైర్యంగా చెబుతానని ఈ బేబి చెప్పుకొచ్చింది.

ప్రేమలో పడితే ధైర్యంగా చెపుతానని అని చెప్పిందే కానీ...మరి ఇలా డేటింగ్ చేసే సంగతుల గురించి ఎందుకు చెప్పట్లేదని ఈ అమ్మడిపై బాలీవుడ్ ఇండస్ట్రీ జోకులేసుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.