English | Telugu

గంధర్వమహల్ లో ఎన్టీఆర్ రభస

"రామయ్య వస్తావయ్యా" తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం "రభస". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మణికొండలోని గంధర్వ మహల్ లో జరుగుతోంది. ఎన్టీఆర్, సమంత ఇందులో పాల్గొంటున్నారు. ఇటీవలే దర్శకుడి అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆపేసారు. కానీ మళ్ళీ దర్శకుడు అనారోగ్యం నుండి కోలుకోవడంతో షూటింగ్ ప్రారంభించారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ప్రణీత నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో తారక్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.