English | Telugu

డిస్ట్రిబ్యూటర్స్ 'రభస' చేస్తారట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రభస' సినిమాకు నిర్మాత బెల్లంకొండ పబ్లిసిటీ సరిగా చేయకపోయినా, ఆ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం రభస చేస్తామని అంటున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చూపిస్తామని అంటున్నారట. యంగ్ టైగర్ సినిమాకి జనాలను రప్పించడానికి పబ్లిసిటీ అవసరంలేదని, గోడపై చిన్న పోస్టర్ పెడితేచాలు రభస.. రభసేనట. దానిని దృష్టిలో పెట్టుకొని పంపిణీదారులు ఈ సినిమాని భారీ సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా చెన్నై వంటి సీటిలో 70స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేశారు. అదే రోజు అక్కడ పవర్ స్టార్ పునీత్ సినిమా రిలీజ్ అవుతున్న, రభసకు అన్ని థియేటర్లు దక్కడం విశేషం. ఈ లెక్కన చూస్తే యంగ్ టైగర్ ఓపెనింగ్స్ తో 'రభస' చేయడం ఖాయమని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.