English | Telugu

ఏప్రెల్ 21న ప్రభాస్ మిస్టర్ పెర్ ఫెక్ట్ రిలీజ్

ఏప్రెల్ 21 న ప్రభాస్ "మిస్టర్ పెర్ ఫెక్ట్" చిత్రం రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్‍ రాజు నిర్మిస్తున్న చిత్రం" మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఏప్రెల్ 21 వ తేదీన రిలీజ్ కానుందట. యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల గండిపేటలో కల సిబిఐటి కాలేజీలో, మార్చ్ 19 వ తేదీన ఘనంగా విడుదల చేయబడింది.


ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కబడ్డీ చిట్టీ అనే పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తూండగా, మరో హీరోయిన్ తాప్సి ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ గా నటిస్తూండటం విశేషం. ఈ చిత్రంలో హీరో ప్రభాస్ వీడియో గేమ్స్ తయారుచేసే కంపెనీ యజమానిగా నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు దశరథ్ గతంలో నాగార్జున హీరోగా "సంతోషం" అనే సుపర్ హిట్‍ చిత్రానికి దర్శకత్వం వహించినా, ఆ తర్వాత అతనికి ఆ రేంజ్ హిట్టింతవరకూ రాలేదు. ఈ చిత్రం దశరథ్ కి మళ్ళీ అంత పెద్ద హిట్టవుతుందని సినీ జనాలంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.