English | Telugu

మహేష్ తో వస్తున్న దీపిక

బాలీవుడ్ వైపు తను వెళ్ళకుండా... బాలీవుడ్ హీరోయిన్ లను తెలుగు ఇండస్ట్రీకి రప్పిస్తున్నాడు ప్రిన్స్ మహేష్. మహేష్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న "శివం" అనే చిత్రం చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను ఎంపిక చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి రానుంది.

మహేష్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో "ఆగడు" అనే చిత్రం తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తన అందాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ అమ్మడు నటించే మొదటి తెలుగు చిత్రం మహేష్ తో కావడం వల్ల అభిమానులతో పాటు దీపిక కూడా ఎదురు చూస్తుందట. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.