English | Telugu

సమంత ఇలా దొరికిపోయింది..!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న 'సమంత' ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. ఈ బ్యూటీ మొదటి సారిగా మహేష్ 'వన్' మూవీపై కామెంట్స్ చేస్తూ.. ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అప్పటితో ప్రారంభమైన ఈ ట్విట్టర్ గోల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ లో సమంత మహేష్ బాబుతో కలిసి నవ్వుతూ సందడి చేయడంతో గొడవ సద్దుమణిగినట్లేనని అందరూ అనుకున్నారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా దాని గురుంచి మర్చిపోలేదు. సమంత లేటెస్ట్ మూవీ సికిందర్ లో బికిని వేసిన ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటో మహేష్ ఫ్యాన్స్ కి ఆయుధంగా మారింది. 'వన్' సినిమా మూవీ పోస్టర్ పై కామెంట్ చేసిన సమంత..ఇప్పుడు ఈ బికిని అవతారంపై ఎలా స్పందిస్తుందోనని ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ ఆమెని ఎగతాళి చేస్తున్నారు. 'అంజాన్'తో కోలీవుడ్ లో తొలి విజయం దక్కుతుందని ఆశించిన సమంతకీ అది దక్కలేదు కాదా మరిన్ని తలనొప్పులు మొదలయ్యాయి. మరి మహేష్ అభిమానుల ఫైర్ ఎప్పుడు చల్లారుతుందో..? సమంత మహేష్ మధ్య వార్ ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడుతుందో..? వేచి చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.