English | Telugu

కొరటాల శివకి హీరో కష్టాలు 

రైటర్ గా సినీ కెరీర్ ని ప్రారంభించి దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించారు 'కొరటాల శివ'(Koratala Siva). మిర్చి,శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, దేవర వంటి విజయవంతమైన చిత్రాలే అందుకు ఉదాహరణ. పైగా ఆయా చిత్రాలన్నీ బడా హీరోలవి కావడంతో పాటు సదరు హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచాయి. దీన్ని బట్టి దర్శకుడిగా కొరటాల శివ రేంజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

కానీ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ నుంచి తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందనే క్లారిటీ లేదు. ఎన్టీఆర్(Ntr)నే స్వయంగా దేవర 2(Devara 2)ఉందని ప్రకటించినా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్(Trivikram)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసాడు. మూవీలోని తన క్యారక్టర్ కోసం మురుగన్ పుస్తకాన్ని చదువుతున్న ఎన్టీఆర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడు సంవత్సరాలు అయినా పట్టవచ్చు. మరి ఆ తర్వాత దేవర 2 ఉంటుందా లేదా అనేది డౌట్. మరి ఈ లోపు వేరే హీరోలు ఎవరినైనా ట్రై చేద్దామని అనుకుందామంటే పెద్ద హీరోలు ఎవరు ఖాళీగా లేరు. నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా మరో రెండు సంవత్సరాలు ఖాళీగా లేరు. మరి అంతకంటే తక్కువ హీరోలతో కొరటాల చేసే ఛాన్స్ ఉండదు. దీన్ని బట్టి కొరటాలకి హీరోల కష్టాలు మొదలయినట్టే అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.

వరుస విజయాల్లో ఉన్న కొరటాల శివ కి చిరు(Chiranjeevi)చరణ్(Ram Charan)తో చేసిన 'ఆచార్య' భారీ డిజాస్టర్ గా నిలవడం పెద్ద మైనస్ గా నిలిచింది. దాంతో ఆ సమయంలో బడా హీరోలు ఎవరు కొరటాల శివ తో సినిమా చేయడానికి ఇష్టపడలేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నడిచింది. ఆ సమయంలో కొరటాల శివ కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడం, దేవర ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలవడం తెలిసిందే.



ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.