English | Telugu

'తమ్ముడు' రిలీజ్ ట్రైలర్.. నితిన్ ఈసారైనా హిట్ కొడతాడా?

2020 లో వచ్చిన 'భీష్మ' తర్వాత నితిన్ సక్సెస్ చూడలేదు. 'చెక్', 'రంగ్ దే', 'మాచర్ల నియోజకవర్గం', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్‌హుడ్'.. ఇలా ఐదు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా.. అన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో జూలై 4న విడుదల కానున్న 'తమ్ముడు'పైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా.. తమ్ముడు సినిమాతో నితిన్ కమ్ బ్యాక్ ఇస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

తమ్ముడు రిలీజ్ ట్రైలర్ దాదాపు రెండున్నర నిమిషాల నిడివి ఉంది. ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుతో ఓ డిఫరెంట్ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ ఈ ట్రైలర్ తో కలుగుతోంది. అక్క, తమ్ముడు మధ్య బాండింగ్ చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లుగా చూపించారు. అయినప్పటికీ అక్కకి ప్రాబ్లమ్ వస్తే.. తమ్ముడు ప్రాణానికి తెగించి పోరాడినట్లుగా చూపించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. టెక్నికల్ గా ట్రైలర్ సాలిడ్ గా ఉంది. బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇలా డిఫరెంట్ సెటప్ లో ఉండే యాక్షన్ సినిమాలకు ఈమధ్య ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తమ్ముడుకి పాజిటివ్ టాక్ వస్తే.. నితిన్ ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ దక్కినట్లే. చూద్దాం మరి తమ్ముడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.