English | Telugu

ఈ నెల 12 న ఢిల్లీకి రామ్ చరణ్.. అసలు తగ్గేదేలే  

గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రస్తుతం స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'పెద్ది'(Peddi)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన 'గేమ్ చేంజర్' డిజాస్టర్ గా నిలవడంతో, చరణ్ తో పాటు మెగా అభిమానుల ఆశలన్నీ 'పెద్ది' పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, చరణ్ గెటప్ తో అందరిలో 'పెద్ది' పై పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడ్డాయి. చరణ్ చెప్పిన డైలాగులు కూడా, సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు, సోషల్ మీడియా వేదికగా నేషనల్ లెవల్లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పెద్ది' గ్యారంటీ హిట్ అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. చరణ్ సరసన జాన్వీకపూర్(janhvi kapoor)హీరోయిన్ గా చేస్తుంది.

శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటున్న 'పెద్ది' ఇటీవలే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంది. దీంతో తమ తదుపరి షెడ్యూల్ ని ఢిల్లీలో జరుపుకోవడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, చరణ్, జాన్వీలపై రొమాంటిక్ సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. రెండు సాంగ్స్ ని కూడా ఈ షెడ్యూల్ లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సాంగ్స్ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయని ఒక సరికొత్త చరణ్ ని అభిమానులు చూడబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ తో సినిమా సగ భాగం కంప్లీట్ అయినట్టే అని, మిగతా షెడ్యూల్ ని కూడా ఆగస్టు కి పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని యూనిట్ అనుకుంటుంది.

మెగా అభిమానులకి, ప్రేక్షకులకి ఈ సారి 'పెద్ది' రూపంలో మెమొరీబల్ హిట్ ఇవ్వాలని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)భావిస్తుంది. చరణ్, మైత్రి కాంబోలో ఇప్పటికే వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. దీంతో అంతకు మించి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మైత్రి సంస్థ ఉంది. వృద్ధి సినిమాస్, సుకుమార్(Sukumar)రైటింగ్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. 'పెద్ది' లో చరణ్ పలురకాల గేమ్స్ లో ప్రావిణ్యం పొందిన అటగాడిగా కనిపిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు(Buchibabu)దర్శకుడు కాగా శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేన్దు శర్మ తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2026 మార్చి 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.



ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.