English | Telugu

ఎన్టీఆర్‌ని బాల‌య్య ఆహ్వానిస్తాడా??

నంద‌మూరి బాల‌కృష్ణ - ఎన్టీఆర్‌ల మ‌ధ్య అడ్డు తెర‌ల‌ను దించ‌డానికి మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. బాబాయ్ - అబ్బాయ్‌ల మ‌ధ్య బ్రిడ్జ్ వేయ‌డానికి ఇంకో ఛాన్స్ ద‌క్కింది. బాల‌య్య‌, ఎన్టీఆర్ ల‌మ‌ధ్య గ్యాప్ రోజురోజుకీ పెరిగిపోతోంద‌న్న మాట నంద‌మూరి అభిమానులే ఒప్పుకొంటారు. వీళ్లిద్ద‌రిని క‌ల‌ప‌డానికి నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాలు, టీడీపీ పార్టీలోని ప్ర‌ముఖులు ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త పెర‌గ‌డానికి.... ఓ ఛాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే నంద‌మూరి బాల‌కృష్ణ ల‌య‌న్ ఆడియో వేడుక హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌ర‌గ‌బోతోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ వ‌స్తాడా? రాడా?? అనే ప్ర‌శ్న‌లు ద‌ల‌య్యాయి. టెంప‌ర్ ఆడియోకి బాల‌య్య వ‌స్తాడ‌నుకొన్నారంతా. కానీ సాధ్యం కాలేదు. ఈసారి బంతి బాల‌య్య కోర్టులో ఉంది. బాల‌య్య స్వ‌యంగా క‌ల్పించుకొని ఎన్టీఆర్‌ని ఆహ్వానిస్తాడా? లేదంటే ఎన్టీఆర్ త‌న‌కు తాను స్వ‌చ్ఛందంగా ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తాడా?? అనే విష‌యాల‌పై అభిమానులు ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్నారు. బాల‌య్య ఒక మెట్టు దిగ‌డు, ఎన్టీఆర్ పంతం త‌గ్గించుకోడు. ఆయ‌న పిల‌వ‌డు.. ఈయ‌న వెళ్ల‌డు. ఈ గ్యాప్ ఇలా కొన‌సాగుతుందంతే.. అంటూ నంద‌మూరి అభిమానులే వ్యాఖ్యానించుకోవ‌డం విశేషం. క‌ల్యాణ్‌రామ్‌తో అటు బాల‌య్య‌కు ఇటు ఎన్టీఆర్‌కూ మంచి సంబంధాలున్నాయి. ఆయ‌నే మ‌ద్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తే ఈ గొడ‌వ వ‌దిలిపోతుంది క‌దా... అంటున్న‌వాళ్లూ ఉన్నారు. మ‌రి క‌ల్యాణ్ రామ్ ఆ సాహ‌సానికి పూనుకొంటాడో లేదో చూడాలి మ‌రి. మొత్తానికి ల‌య‌న్ పాట‌లు ఎలా ఉంటాయి అనే ఆలోచ‌న‌ల కంటే ఈ వేడుక‌కు ఎన్టీఆర్ వెళ్తాడా, వెళ్ల‌డా? అనే సందేహాలే ఎక్కువైపోయాయి. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.