English | Telugu

అప్పుడూ.. ఇప్ప‌ుడూ ర‌జినీకాంతే.. రేర్ రికార్డ్‌

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైల‌ర్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. విడుద‌లైన 11 రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌పరిచింది. అంత‌కు ముందు త‌లైవా న‌టించిన‌ ఆరు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేదు. కానీ ‘జైల‌ర్’ సక్సెస్ వాటన్నింటినీ మరపించేసింది. ఈ సినిమా సాధించిన క‌లెక్ష‌న్స్‌పై ఆయ‌న అభిమానులు, కోలీవుడ్ వ‌ర్గాలు, ట్రేడ్ పండితులు అంద‌రూ హ్యాపీగానే ఉన్నారు. రోజు రోజుకీ ఈ మూవీ కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.

తాజాగా రజినీకాంత్ త‌న ‘జైల‌ర్’ సినిమాతో టాలీవుడ్‌లో ఓ రికార్డ్ క్రియేట్ చేయ‌టం విశేషం. అదేంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే కోలీవుడ్ స్టార్ తెలుగు మార్కెట్‌లో రూ.50 కోట్ల గ్రాస్‌ను క్రాస్‌ చేయ‌లేదు. తొలిసారి త‌లైవా, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 2.0 మూవీ ఆ రేర్ ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ఇప్పుడు ‘జైల‌ర్’ సినిమా కూడా ఆ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. మూవీ విడుద‌లైన ప‌దకొండు రోజుల‌కే రూ.68 కోట్ల మేర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇదే జోరు మ‌రో వారం కొన‌సాగితే సుల‌భంగా 2.0 రికార్డుని జైల‌ర్ అధిగ‌మిస్తుంద‌ని మీడియా వ‌ర్గాలంటున్నాయి.

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళానిధి మార‌న్ ఈ సినిమాను నిర్మించారు. ర‌జినీకాంత్‌తో టైటిల్ పాత్ర‌లో న‌టించ‌గా సౌత్ సూప‌ర్‌స్టార్స్ మోహ‌న్ లాల్, శివ రాజ్‌కుమార్ అతిథి పాత్ర‌ల్లో అద‌ర‌గొట్టారు. వసంత్ రవి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, వినాయకన్ ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.