English | Telugu

జాట్ ట్రైలర్ అదుర్స్..తెలుగు వాడి సత్తా చాటి చెప్పారు 

భారతీయ సినీ ప్రేమికులకి బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్(Sunny deol)గురించి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.1983 లో వచ్చిన బేతాబ్ తో ఎంట్రీ ఇచ్చిన సన్నీ డియోల్ నేటికీ తన అధ్బుతమైన నటనతో అభిమానులని,ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు.కొంత గ్యాప్ తీసుకొని 2023 లో 'గదర్ 2(Gadar 2)తో వచ్చి కలెక్షన్ల సునామీని సృష్టించాడు.60 కోట్లతో నిర్మిస్తే 690 కోట్ల దాకా వసూలు చేసింది.

ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 10 న తన కొత్త మూవీ'జాట్' తో మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎక్కువ భాగం మన తెలుగు టెక్నీషయన్స్ పని చేస్తున్నారు.క్రాక్,వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేని(Gopichandh malineni)దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి.థమన్(Thaman)సంగీతాన్ని,నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు.ఈ విధంగా హిందీ చిత్ర సీమలో తెలుగు వాడి గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు.ఆర్టిసుల పరంగాను జగపతి బాబు,రమ్య కృష్ణ కీలకపాత్రల్లో చేస్తుండగా,తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు పొందిన రెజీనా హీరోయిన్ గా బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది.అజయ్ ఘోష్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక ట్రైలర్ గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.యాక్షన్ సినిమాలని ఇష్టపడే సినీ ప్రియులకి ఫుల్ మీల్స్ గ్యారంటీ అనే విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్ధమవుతుంది.పోరాట దృశ్యాలని కూడా సరికొత్తగా డిజైన్ చేసినట్టుగా ఉన్నారు.రణదీప్ హుడా ప్రతినాయకుడుగా చేస్తుండగా వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్,జరీనా వాహబ్, ఉపేంద్ర లిమాయె తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.