English | Telugu

డేవిడ్ వార్నర్ వివాదంపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్!

'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. (David Warner)

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్ర పోషించాడు. మార్చి 23న 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. వార్నర్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే ఈ వేడుకలో ఆయనకు ఊహించని అవమానం జరిగింది. (Robinhood)

'రాబిన్ హుడ్'లో కీలక పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్ ఈ ప్రీ ఈవెంట్ లో వార్నర్ గురించి మాట్లాడుతూ నోరు జారారు. "వెంకీ కుడుముల, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ ని పట్టుకొచ్చారు. ఈ వార్నర్ ని క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్పులేస్తున్నాడు. దొంగ ముండా కొడుకు.. మామూలోడు కాదు. రేయ్ వార్నర్.. బి వార్నింగ్" అని రాజేంద్రప్రసాద్ అన్నారు. (Rajendra Prasad)

రాజేంద్రప్రసాద్ సరదాగా మాట్లాడుతున్నాను అనుకొని ఉండొచ్చు. కానీ, ఒక పబ్లిక్ ఈవెంట్ లో.. 'దొంగ ముండా కొడుకు' అని ఒక స్టార్ క్రికెటర్ ని అనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయంపై క్షమాపణలు చెబుతూ తాజాగా రాజేంద్రప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు.

"నాకు వార్నర్ అంటే ఇష్టం. అతని క్రికెట్ అంటే ఇష్టం. అలాగే వార్నర్.. మన తెలుగు సినిమాలను, తెలుగు నటులను ఇష్టపడతాడు. మేము ఒకరికొకరం బాగా క్లోజ్ అయిపోయాం. నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాకపోయినా, జరిగిన సంఘటన వల్ల మీ మనసు బాధపడినట్లయితే.. మీ అందరికీ క్షమాపణలు." అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.