English | Telugu

రామ్ చరణ్ హీరోయిన్ దర్శకురాలిగా మారనుందా!

సిల్వర్ స్క్రీన్ పై ఎంతో మంది మహిళా దర్శకులు విభిన్న చిత్రాలని తెరకెక్కించి ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. కానీ హీరోయిన్ గా సక్సెస్ ని అందుకొని, కొంత గ్యాప్ తర్వాత దర్శకురాలిగా మారడం అనేది చాలా అరుదు. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం చిరుత(Chirutha). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన భామ 'నేహాశర్మ'(Neha Sharma). తొలి చిత్రంతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకొని, ఆ తర్వాత కుర్రోడు చిత్రంలో వరుణ్ సందేశ్ తో జత కట్టింది.

ఇప్పుడు నేహాశర్మ దర్శకురాలిగా మారనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn)నిర్మాణ సారధ్యంలో సదరు చిత్రం తెరకెక్కబోతుందని, సిద్దాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi),మోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారనే చర్చ జోరుగానే నడుస్తుంది. 1945 వ సంవత్సరం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టుగా టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని అంటున్నారు.

చిరుత, కుర్రోడు చిత్రాల తర్వాత నేహాశర్మ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు పొందింది. తమిళ, మలయాళ, పంజాబీ భాషల్లో సుమారు పదిహేను చిత్రాల వరకు చేసిన నేహా, నాచురల్ స్టార్ నాని(Nani),మృణాల్ ఠాకూర్(Mrunal thakur)జంటగా వచ్చిన 'హాయ్ నాన్న' లో క్యామియో రోల్ లో కనిపించింది. సోలో హీరోయిన్ గా 2023 లో నవాజుద్దీన్ సిద్ధికి తో కలిసి 'జోగిరా సరా రా రా' అనే చిత్రంలో చేసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.