English | Telugu

హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రభాస్ తర్వాత ఒకే ఒక్కడు..!

'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమా 'వార్-2' కావడం విశేషం.

'ఆర్ఆర్ఆర్'తో మొదటిసారి ఈ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' కూడా దాదాపు రూ.500 కోట్లు సాధించింది. ఇక ఇప్పుడు 'వార్-2' ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి.. 400 కోట్ల దిశగా పయనిస్తోంది.

ఇప్పటిదాకా హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ కలిగి ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ఏకంగా రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. మొదటిసారి 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'సాహో' సినిమాలతో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' చిత్రాలతో మరోసారి హ్యాట్రిక్ 300 కోట్లు సాధించాడు. ప్రభాస్ తర్వాత హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ ఉన్న టాలీవుడ్ హీరోగా ఇప్పుడు ఎన్టీఆర్ నిలిచాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం