English | Telugu

రామ్ చరణ్ టార్గెట్ మిస్సయింది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' దసరాకి మిస్ అయ్యే అవకాశ౦ వున్నట్లు సమాచారం. ఈ సినిమా పక్కాగా అక్టోబర్ 1 న రిలీజ్ చేయాలని యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ అందుకొనే అవకాశ౦ లేదట. ఎందుకంటే ఈ సినిమాలో కృష్ణవంశీ కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే ప్రకాష్‌రాజ్, జయసుధ పార్ట్ రీషూట్ వల్ల సినిమా చిత్రీకరణ లేట్ అయింది. కానీ ఫారిన్‌ షెడ్యూల్స్‌, పాటల షూటింగ్స్‌ వగైరా బ్యాలెన్స్‌ ఉడడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆలస్యం అవుతాయని ఇన్‌సైడ్ న్యూస్. పైగా డైరెక్టర్ కృష్ణవంశీ ఎడిటింగ్‌లో ఉంటే కథ నెల రోజుల్లో ఫస్ట్‌ కాపీ రెడీ చేయడమనేది సాధ్యం కాదట. కాబట్టి గోవిందుడు టార్గెట్ మిస్ అయ్యే చాన్సులు ఎక్కువని ఇండస్ట్రీ సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.