English | Telugu

ఘాటి మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ సీన్ సినిమాకే హైలైట్..!

వేదం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'ఘాటి'. రేపు(సెప్టెంబర్ 5న) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సెన్సార్ నుంచి 'ఘాటి'కి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ చిత్రం గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. (Ghaati Movie)

యాక్షన్, ఎమోషన్స్ ని మిళితం చేస్తూ 'ఘాటి' చిత్రాన్ని దర్శకుడు క్రిష్ అద్భుతంగా రూపొందించాడట. ఫస్ట్ హాప్ ఉత్కంఠభరితమైన యాక్షన్‌ తో సాగిందని తెలుస్తోంది. రైల్వే స్టేషన్ సీక్వెన్స్, గుహలో జరిగే ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్‌ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయట. అలాగే, సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ హృదయాలను హత్తుకునేలా ఉన్నాయని అంటున్నారు. ఇక క్లైమాక్స్ అయితే గూస్‌బంప్స్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉండగా, దేనికదే ప్రత్యేకంగా నిలిచాయట. యాక్షన్ సీన్స్ ఎంతగా అదిరిపోయాయో.. ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయినట్లు వినికిడి.

అనుష్క ఎంత గొప్ప నటినో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పుడు 'ఘాటి'లోనూ శీలావతి పాత్రలో నటవిశ్వరూపం చూపించిందట. ఆమె యాక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని టాక్. ముఖ్యంగా ఒక సన్నివేశంలో ప్రతినాయకులు శీలావతిని వివస్త్రను చేసి అవమానిస్తారని, ఆ సీన్ కంటతడి పెట్టించేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఆ సీన్ నిజంగా సినిమాలో ఉందో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఉంటే మాత్రం.. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ అలాంటి సీన్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.