English | Telugu

ఓటీటీలోకి కూలీ.. ఇలా అయితే ఎలా మాస్టారు!

ఓ వైపు థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు రోజురోజుకి తగ్గిపోతున్నారని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మరోవైపు, అదే నిర్మాతలు తమ సినిమాలను మూడు, నాలుగు వారాలకే ఓటీటీలో విడుదల చేస్తుంటారు. ఇప్పుడు 'కూలీ' కూడా నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. (Coolie On OTT)

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. అయితే ఈ మూవీ నెల కూడా తిరగకుండానే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

'కూలీ' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రైమ్ వీడియో ప్రకటించింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత అందుబాటులోకి రానుంది.

'కూలీ' లాంటి భారీ సినిమాలను కూడా నాలుగు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయడంపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. భవిష్యత్ లో స్టార్ హీరోల సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ రాకపోతే.. ఫస్ట్ వీకెండ్ కే సర్దేసుకోవాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.