English | Telugu

అంజలి హాఫ్‌ సెంచరీ.. గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది!

ప్రముఖ నటి అంజలి టైటిల్ రోల్ పోషించిన హారర్ కామెడీ చిత్రం 'గీతాంజ‌లి', 2014 ఆగస్టులో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ప్రతీకార జ్వాల‌తో మళ్ళీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ తాజాగా 'గీతాంజ‌లి' సీక్వెల్ ని ప్రకటించారు మేక‌ర్స్.

'గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది' అనే టైటిల్ తో ఈ సీక్వెల్ ను తెర‌కెక్కిస్తున్నారు. వెన్నులో వ‌ణుకు పుట్టించే ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేక‌ర్స్. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన గీతాంజ‌లి సీక్వెల్ షూటింగ్ ఈరోజు(సెప్టెంబర్ 23) నుంచే మొద‌లైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ పాడుబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయి పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి కలిగిస్తోంది.

ఇది అంజ‌లి న‌టిస్తున్న 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి శివ తుర్ల‌పాటి దర్శకుడు. కోన వెంక‌ట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ బ్యానర్స్ పై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ నిర్మిస్తున్నారు.

'గీతాంజ‌లి మళ్ళీ వ‌చ్చింది' చిత్రంలో అంజ‌లి, శ్రీనివాస‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్, రాహుల్ మాధ‌వ్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. కోన వెంక‌ట్‌ కథ అందిసున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, సినిమాటోగ్రాఫర్ గా సుజాత సిద్ధార్థ్, ఎడిటర్ గా చోటా కె ప్ర‌సాద్‌ వ్యవహరిస్తున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.