English | Telugu

ఎనిమిదేళ్ల తర్వాత వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో మూవీ.. ఎవరితోనో తెలుసా?

'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య', 'దేవదాసు' వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. 'దేవదాసు' తర్వాత 'ఒక్క మగాడు', 'సలీమ్' రూపంలో ఘోర పరాజయాలు ఎదురుకావడంతో కొన్నేళ్లు డైరెక్షన్ కి దూరమయ్యారు. 'సలీమ్' 2009 లో విడుదల కాగా, ఆయన డైరెక్ట్ చేసిన తదుపరి సినిమా 'రేయ్' 2015 లో విడుదలైంది. ఈ మూవీతో సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఆరేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చినా.. వైవీఎస్ కి పరాజయం తప్పలేదు. దీంతో ఆయన ఎనిమిదేళ్లుగా మెగా పట్టలేదు. కానీ అనూహ్యంగా ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయనకు డైరెక్షన్ వైపు మనసు మళ్ళింది.

వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ రూపొందనుందట. నూతన నటీనటులతో తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ, టెక్నీషియన్స్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సహా పలువురు సీనియర్లు పని చేయబోతున్నట్లు సమాచారం.

వైవీఎస్ చౌదరి తన సినిమాల ద్వారా పలువురు నూతన నటీనటులను పరిచయం చేశారు. ముఖ్యంగా రామ్ పోతినేని, ఇలియానాలను పరిచయం చేస్తూ తీసిన 'దేవదాసు' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మరి ఎనిమిదేళ్ల తర్వాత డైరెక్టర్ గా రీఎంట్రీ ఇస్తూ కొత్త వాళ్ళతో చేస్తున్న ప్రయత్నం వైవీఎస్ చౌదరికి మళ్ళీ 'దేవదాసు' లాంటి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.