English | Telugu

గమ్యం సంగీత దర్శకుడు అనిల్‍ మృతి

"గమ్యం" చిత్రానికి సంగీతం అందించిన సంగీత దర్శకుడు అనిల్‍ మృతి. వివరాల్లోకి వెళితే యువ సంగీత దర్శకుడు అనిల్ ఏప్రెల్ 21 రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మరణించారు. అనిల్ తొలిసారిగా "సంభవామి యుగే యుగే" చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా తెలిగు సినీ పరిశ్రమలో ప్రవేశించారు. అనంతరం అల్లరి నరేష్, శర్వానంద్, కమలినీ ముఖర్జీలు నటించగా, క్రిష్ ( జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో వచ్చిన "గమ్యం" చిత్రంతో అనిల్ కు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఈ "గమ్యం" చిత్రంలోని "ఎంరవరకూ ఎందుకొరకూ" అనే పాట వ్రాసినందుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మన రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డు లభించింది.

అనంతరం "నిన్న నేడు రేపు" చిత్రానికి, అనంతరం నిఖిల్ హీరోగా, దమ్మాలపాటి నిర్మించిన "కళావర్ కింగ్" చిత్రానికీ, ఇటీవల వచ్చిన "యల్ బి డబ్ల్యూ" క్యాప్షన్ "లైఫ్ బిఫోర్ వెడ్డింగ్" చిత్రానికీ అనిల్ సంగీతం అందించారు. ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న యువ సంగీత దర్శకుడు అనిల్‍ అకాల మరణం తెలుగు సినీపరిశ్రమకు తీరని లోటు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆత్మకు శాంతి కలగాలని తెలుగువన్ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.