English | Telugu

పవర్ స్టార్ 'ఓజీ'లో విలన్ గా ఇమ్రాన్ హష్మీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెట్స్ నుంచి విడుదలైన పవన్ పిక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపడం చూస్తుంటే పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేయడం ఖాయమనిపిస్తోంది.

'ఓజీ'లో కీలక పాత్రల్లో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి నటిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఇమ్రాన్ హష్మీకి ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉండే ఇమ్రాన్ హష్మీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లు ఆయనను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేయడం మంచి నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇమ్రాన్ హష్మీ రాకతో 'ఓజీ'పై నార్త్ ప్రేక్షకుల దృష్టి పడే అవకాశముంది. పైగా 'సాహో'తో దర్శకుడు సుజీత్ కూడా నార్త్ ప్రేక్షకులకు సుపరిచితమే. 'సాహో' సినిమా హిందీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొని, భారీ వసూళ్లతో అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు పవర్ స్టార్ 'ఓజీ'తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేలా సుజీత్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.