English | Telugu

కెప్టెన్ మిల్ల‌ర్ మూవీ ఎన్ని భాగాలో తెలుసా?

ధ‌నుష్ హీరోగా న‌టించిన స‌ర్ బంప‌ర్ హిట్ అయింది. ఈ చిత్రం త‌ర్వాత ఆయ‌న చేస్తున్న కెప్టెన్ మిల్ల‌ర్ మీద కూడా అదే రేంజ్ ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఆయ‌న థిక్ బియ‌ర్డ్, పొడ‌వాటి జుట్టు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ముంబై ఎయిర్‌పోర్టులో ధ‌నుష్‌ని ర‌గ్డ్ అవ‌తార్‌లో చూసిన వారంద‌రూ నెక్స్ట్ మూవీ కెప్టెన్ మిల్ల‌ర్ ప‌క్కా మాస్ మ‌సాలా సినిమా అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ సినిమా ట్ర‌యాల‌జీ అని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ధ‌నుష్ కెప్టెన్ మిల్లర్ త్రీ చాప్ట‌ర్ ఫ్రాంఛైజీ అని ఓ అభిమాని ట్వీట్ చేయ‌డంతో ఈ వార్త వైర‌ల్ అవుతోంది.

వెంట‌నే దీనికి సంబంధించిన డీటైల్స్ షేర్ అవుతున్నాయి. ఫ‌స్ట్ చాప్ట‌ర్‌ని 1940ల్లో కాన్‌సెన్‌ట్రేట్ చేస్తార‌ట‌. సెకండ్ చాప్ట‌ర్‌లో 1990ల్లో క‌థ చెబుతార‌ట‌. మూడో చాప్ట‌ర్‌లోనే మోడ్ర‌న్ డేస్ క‌థ ఉంటుంద‌న్న‌ది స్ప్రెడ్ అవుతున్న వార్త‌. ఈ ఏడాదే ఫ‌స్ట్ పార్టును ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల నెక్స్ట్ సినిమాలో హీరోగా న‌టించ‌నున్నారు ధ‌నుష్‌. కెప్టెన్ మిల్ల‌ర్ మూడు పార్టుల్ని పూర్తి చేసి శేఖ‌ర్ మూవీలో జాయిన్ అవుతారా? లేకుంటే అంత‌క‌న్నా ముందే వ‌స్తారా? అనేది నిదానం మీద తెలుస్తుంది. శేఖ‌ర్ సినిమా పూర్త‌య్యాక రాయ‌న్ సినిమా చేస్తారు. రాయ‌న్ మూవీ క‌థ‌, డైర‌క్ష‌న్ పూర్తిగా ధ‌నుష్‌దే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.