English | Telugu

త్వరలోనే 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్..!

విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. 2018లో విడుదలైన ఈ కామెడీ ఫిల్మ్ యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ఇప్పటికీ ఎందరో రిపీటెడ్ గా చూస్తుంటారు. ఇటీవల రీ రిలీజ్ లోనూ మంచి వసూళ్లు రాబట్టిందంటే.. 'ఈ నగరానికి ఏమైంది'కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీకి త్వరలో సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. (Ee Nagaraniki Emaindi Sequel)

'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆరేళ్ళ తర్వాత విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ చేతులు కలపబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని అంటున్నారు. ఈ ఇక ఈ క్రేజీ సీక్వెల్ ను '35 చిన్న కథ కాదు' చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్ నిర్మించనుందట.

'ఈ నగరానికి ఏమైంది' నలుగురు స్నేహితుల కథగా ప్రేక్షకులను అలరించింది. ఇందులో విశ్వక్ సేన్​ తో పాటు అభినవ్ గోమఠం, సాయి సుశాంత్, వెంకటేష్‌ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. మరి సీక్వెల్ కోసం అదే గ్యాంగ్ రంగంలోకి దిగుతుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.