English | Telugu

ఫలితాల మధ్య మందేసి, చిందేసిన త్రిష

త్రిష సినిమాల్లో చిందులేస్తే అందంగా ఉంటుంది. సినిమాలు లేనందుకేమో ఇప్పుడు మందేసి చిందులేసి నానా రగడ చేసింది. శుక్రవారం అంతా ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తి గా చూస్తూ ఉంటె మధ్యలో కొన్ని టీవీ ఛానల్స్‌లో త్రిష ప్రత్యక్షమైంది. ఆమె ఏ ప్రాంతం నుంచో పోటి చేసి ఎన్నికల వార్తలలోకి దూసుకురాలేదు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి మందు కొట్టి రగడ చేసిందంటూ వార్తలు ప్రసారం అయ్యాయి. ఇవి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
ముందు నుండి పార్టీ గర్ల్ గా త్రిషకు పేరుంది. మే 4వ తేదీన త్రిష బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్ నయనతార, అమలా పాల్, రమ్య కృష్ణ, శింబుతో పాటు మరికొంత మందిని పిలిచి పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్స్ కు సంభందించిన ఇలాంటి వార్తలు వస్తే రేటింగ్స్ బాగా వస్తాయని తెలిసిన ఛానల్స్ వాటిని పూర్తి గా సద్వినియోగం చేసుకుంటాయి. నిన్నా అదే జరిగి ఉంటుంది. అయితే ఇలా తాగి వివాదాల్లో చిక్కుకోవడం త్రిషకు ఇదే మొదటి సారి కాదు. ఏమైనా సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిషకు ఇలాంటి తప్పులు పదే పదే చేస్తు వార్తల్లోకి రావటం ఆమె అభిమానులకు కొంత బాధ కలిగిస్తుందేమో.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.