English | Telugu

మరికొన్ని రోజుల్లో వైజాగ్ వెళ్తున్న రామ్ చరణ్..ఎవరికీ తెలియకుండా ఒక విఐపి జాగ్రత్తలు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో సినిమా లవర్స్ కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర్నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని ప్రకటించకుండానే లీకుల రూపంలో బయటకి వస్తూనే ఉన్నాయి.వాటన్నిటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.


గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతుంది. చరణ్ మీద ఇతర తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలని శంకర్ చిత్రీకరించాడు. కాగా నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ కి సంబంధించే శంకర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.ఈ సినిమాలో నటిస్తున్న చాలా మంది ఆర్టిసులకి టెక్నిషియన్స్ కి సినిమా షూటింగ్ రోజున సెట్స్ కి వెళ్లే వరకు కూడా ఏ సీన్ చేస్తున్నాము అనే విషయం తెలియదు.పైగా ఆర్టిసులకి తాము ఎవరితో కలిసి చెయ్యబోతున్నామనే విషయం కూడా తెలియదు.కేవలం అక్కడికి వెళ్లిన తర్వాతే శంకర్ వారికి సీన్స్ వివరిస్తారు. దీని బట్టి గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ఎంత కేర్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

చరణ్ తో కియారా అద్వానీ జోడి కడుతున్న ఈ సినిమాలో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథమహారధులందరు నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని హై వాల్యూస్ తో గేమ్ చేంజర్ ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.