English | Telugu

దిల్ రాజు, సాయికిరణ్ అడవి

ప్రముఖ యువ నిర్మాత, పంపిణీదారుడూ అయిన దిల్ రాజు ఒక కొత్త చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో నటించబోయే హీరో, హీరోయిన్ కూడా కొత్తవారినే పరిచయం చేయబోతున్నారు.కానీ ఈ చిత్రానికి దర్శకుడు మాత్రం గతంలో కృష్ణుడు హీరోగా "వినాయకుడు", "విలేజ్ లో వినాయకుడు" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాయికిరణ్ అడవిని నియమించినట్లు సమాచారం.ఈ చిత్రాన్ని అత్యంత లోబడ్జెట్ లో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారట.ఈ చిత్రానికి "కేరింత" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం.దిల్ రాజు ప్రస్తుతం యంగ్ రెబల్‍ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్, తాప్సి హీరోయిన్లుగా,దశరథ్ దర్శకత్వంలో "మిస్టర్ పర్‍ఫెక్ట్" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.