English | Telugu

రెండు కోట్ల కొండెక్కిన దేవిశ్రీ

డైరెక్టర్లు పదేసి కోట్లు.. హీరోలు పదిహేనేసి కోట్లు తీసుకుంటుండగా.. తాను మాత్రం కోటి రూపాయలతోనే సరిపెట్టుకోవడం నామోషీగా భావించినట్లున్నాడు దేవిశ్రీప్రసాద్. అందుకే తన రెమ్యూనరేషన్‌ను రెండు కోట్లకు పెంచేసాడు. "జులాయి, గబ్బర్‌సింగ్, మిర్చి" చిత్రాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్టయి.. ఆ చిత్రాలు సాధించిన విజయాలలో సముచిత పాత్ర పోషించడంతో.. ప్రతి డైరెక్టరు, హీరో.. దేవిశ్రీప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకోవాలని ఫిక్సయిపోవడం మొదలుపెట్టారు. ఈ తాకిడిని తట్టుకోలేక్.. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ.. మొన్నటివరకు కోటి, కోటిన్నర మధ్య తీసుకుంటూ వచ్చిన దేవిశ్రీప్రసాద్.. గత కొన్ని చిత్రాలుగా.. రెండు కోట్ల కొండెక్కి కూర్చున్నాడని తెలుస్తోంది. డైరెక్టర్‌కి పది కోట్లు.. హీరోకి పదిహేను కోట్లు ఇచ్చినా.. మ్యూజిక్ హిట్టయితేనే సినిమా హిట్టవుతుంది కాబట్టి.. తనకు రెండు కోట్లిచ్చినా తక్కువేనని వాదిస్తున్నాడంట దేవిశ్రీ. ఇతగాడు ప్రస్తుతం బాలకృష్ణ_బోయపాటి కాంబినేషన్ సినిమా, నాగార్జున "భాయ్", పవన్‌కళ్యాణ్ "అత్తారింటికి దారేది?", మహేష్‌బాబు నటిస్తున్న "ఒన్ నేనొక్కడినే", రామ్‌చరణ్ "ఎవడు", కార్తీ "బిర్యానీ" చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.