English | Telugu

రవితేజ ఖాతాలో మరో డైరెక్టర్

పెద్దగా వెలుగులోకి రాలేదు కానీ.. రవితేజ సినిమా ద్వారా చాలామంది దర్శకులుగా పరిచయమయ్యారు. హరిష్ శంకర్ (షాక్), గోపీచంద్ మలినేని (డాన్ శీను), బోయపాటి శ్రీను (భద్ర) తదితరులను దర్శకులను చేసిన ఘనత రవితేజదే. అప్పటికి తాను స్టార్ కాకపోయినా నేటి అగ్ర దర్శకుడు శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమైంది.. రవితేజ నటించిన "నీ కోసం" చిత్రంతోనే. ఆ తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో "వెంకీ, దుబాయ్ శీను" చిత్రాలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం రామ్‌చరణ్ "జంజీర్" తెలుగు వెర్షన్ "తుఫాన్"కు దర్శకత్వం వహిస్తున్న యోగి కూడా రవితేజ నటించిన "ఒక రాజు.. ఒక రాణి" చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతగాడు వెంకటేష్‌తో "చింతకాయల రవి" చిత్రం తీసాడు. ఈ డాటా అంతా ఎందుకంటే.. తాజాగా రవితేజ మరో దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నాడు. "బలుపు" చిత్రానికి కథ,మాటలు అందించిన "బాబి" అనే రచయిత రవితేజ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. "బలుపు" ఈనెల 28న విడుదలవుతుండడం తెలిసిందే!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.