English | Telugu

దేవర అక్కడ తప్ప అన్ని చోట్లా హిట్టే...

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' (Devara) మూవీ సెప్టెంబర్ 27న విడుదలైంది. డివైడ్ టాక్ తోనూ అదిరిపోయే వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన దేవర.. కేవలం పది రోజుల్లోనే రూ.220 కోట్లకు పైగా షేర్(రూ.400 కోట్ల గ్రాస్)తో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, నార్త్, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్లా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దాదాపు అన్ని చోట్లా లాభాల్లోకి ఎంటరైంది. కానీ ఒక్క చోట మాత్రం 'దేవర'కు నిరాశ ఎదురైంది.

తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. కానీ తమిళనాడులో తెలుగు సినిమాలకు ఆ పరిస్థితి ఉండదు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు తప్ప.. తమిళనాట తెలుగు సినిమాలు పెద్దగా ఆదరణకు నోచుకోవు. అందుకే తెలుగు చిత్రాలకు తమిళ్ లో పెద్దగా బిజినెస్ కూడా జరగదు. 'దేవర' కూడా తమిళ్ లో రూ.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే చేసింది. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించడంపై అనుమానం కలుగుతోంది. దేవర పదిరోజుల్లో తమిళ్ లో రూ.4 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.2 కోట్ల షేర్ రాబట్టాల్సింది. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఆ మొత్తం రాబట్టడం ఖాయమనే అనిపిస్తోంది. అదే జరిగితే దేవర తమిళనాడులో మాత్రమే కాస్త నష్టాలను చూసినట్లు అవుతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.