English | Telugu

Kantara: కాంతారను కాపాడిన కోర్టు.. లేదంటే ఎంత నష్టమో..!

'కాంతార'కి ప్రీక్వెల్ గా రూపొందిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటిదాకా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఒక్క కర్ణాటకలోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. దీపావళి ఉండటంతో ఫుల్ రన్ లో కర్ణాటకలో రూ.200 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేసే అవకాశముంది. అయితే 'కాంతార చాప్టర్ 1' ఈ ఫీట్ సాధించడం వెనుక.. పరోక్షంగా కర్ణాటక హైకోర్టు చేసిన సాయముంది. కోర్టు లేకపోతే ఈ సినిమా వసూళ్ళు కనీసం రూ.50 కోట్లు తగ్గేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Kantara Chapter 1)

సామాన్యులకు సినీ వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఓ జీవో తీసుకొచ్చింది. దాని ప్రకారం, మూవీ టికెట్ ధర రూ.200 కి మించకూడదు. ఈ నిర్ణయం భారీ బడ్జెట్ సినిమాలకు బిగ్ షాక్ లాంటిదే. అలాగే, బెంగళూరులో పలు లగ్జరీ మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. స్క్రీన్ క్వాలిటీ, అక్కడి వసతులను బట్టి.. వాటిలో రూ.500 నుంచి రూ.2000 వరకు ఒక్కో టికెట్ ధర ఉంటాయి. అలాంటిది టికెట్ ధరను రూ.200 కి తగ్గిస్తే, తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదనేది మల్టీప్లెక్స్ యాజమాన్యాల వాదన. ఈ క్రమంలోనే 'కాంతార' సహా పలు భారీ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్, అలాగే మల్టీప్లెక్స్ అసోసియేషన్ కోర్టుని ఆశ్రయించాయి. ఇదంతా 'కాంతార చాప్టర్ 1' విడుదలకు ముందు జరిగిన తతంగం.

నిర్మాతలు, మల్టీప్లెక్స్ యాజమాన్యాల వాదనలు విన్న హైకోర్టు.. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై స్టే విధించింది. దీంతో 'కాంతార చాప్టర్ 1' కర్ణాటకలో మునుపటి టికెట్ ధరలతోనే విడుదలైంది. ఒకవేళ కోర్టు.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయితే.. మల్టీప్లెక్స్ లలో కూడా రూ.200 టికెట్ ధరతో కాంతార విడుదలై ఉండేది. అదే జరిగి ఉంటే.. వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేది. ఎంత ఫుట్ ఫాల్స్ పెరిగినా కర్ణాటకలో ఇప్పుడొచ్చిన రూ.170 కోట్ల గ్రాస్ అసలు సాధ్యమయ్యేది కాదని, కనీసం రూ.50 కోట్లకు గండి పడేదని అంటున్నారు. ఆ పరంగా చూస్తే, కర్ణాటక హైకోర్టు కాంతారకు ఎంతో మేలు చేసినట్టే లెక్క.

టికెట్ ధరల జీవో అంశం ఇంకా కోర్టులోనే ఉంది. దీనిపై బలంగా వాదనలు వినిపించడానికి కర్ణాటక సర్కార్ సిద్ధమవుతోంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం.. భవిష్యత్ లో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం జరిగే అవకాశముంది. ఏది ఏమైనా ఈ విషయంలో 'కాంతార చాప్టర్ 1' సేవ్ అయిందని చెప్పవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.