English | Telugu

శ్రీకాంత్ పై మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. షాక్ తప్పదా?

మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల కొందరు ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఆయన నటించిన 'అరి' సినిమా పోస్టర్లని చించివేశారు. ఇప్పటికే శ్రీకాంత్ అయ్యంగార్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తాజాగా మా అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. మా అధ్యక్షులు మంచు విష్ణుని కలిసి జాతిపిత మహాత్మా గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని, అతని 'మా' సభ్యత్వం రద్దు చేయాలని కోరారు.

ఫిర్యాదు అనంతరం బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. "నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశాం. శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. మహాత్మా గాంధీ గురించి సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెడుతున్నాడు. ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం. మా అసోసియేషన్ శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. సినిమా పెద్దలను కోరుతున్నాను.. మీరు దీనిపై స్పందించాలి. ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి." అని అన్నారు.

శ్రీకాంత్ అయ్యంగార్ పై బల్మూరి వెంకట్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ స్పందించారు. "ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఈరోజుల్లో ఫ్యాషన్ అయ్యింది. మాకు డిస్ప్లినరీ కమిటీ ఉంది.. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా కమిటీ మీటింగ్ పెట్టి.. త్వరలోనే చర్యలు తీసుకుంటాం." అన్నారు.

కొంతకాలంగా శ్రీకాంత్ అయ్యంగార్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నారు. ముఖ్యంగా గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో దారుణ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యతిరేకత, ఫిర్యాదుల నేపథ్యంలోనైనా శ్రీకాంత్ అయ్యంగార్ వెనక్కి తగ్గుతారేమో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.