English | Telugu

మిర్చి అంటే ప్రభాస్, ఫైర్ అంటే బాలయ్య.. పవన్ కళ్యాణ్ తో ఒక్క ఛాన్స్!

పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రెజీనా కసాండ్రా, ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో విజయ్ బిన్నీ మాస్టర్ తో పాటు కో-జడ్జిగా అలరిస్తోంది. అలాంటి రెజీనా ఒక చిట్ చాట్ షోలో చాలా విషయాలను షేర్ చేసుకుంది.

"20 ఏళ్ళ మీ సినిమా జర్నీ గురించి మీ మాటల్లో" అన్న ప్రశ్నకు.."ఓ అదొక పెద్ద స్టోరీ ఐపోతుంది. ఇదొక ఫన్, ఎక్సయిటింగ్ జర్నీ, కానీ టఫ్ గా ఉంది. చాలా మెమొరబుల్ నాకు" అంటూ ఆన్సర్ ఇచ్చింది రెజీనా. "మీ చైల్డ్ హుడ్ హీరో క్రష్ ఎవరు" అని అడగగా.. "ఐదారేళ్ళ వయసున్నప్పుడు నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం అలాగే విజయ్ ఇంకా మహేష్ బాబు కూడా" అని చెప్పింది.

"కొన్ని ఐటమ్స్ నేమ్స్ చెప్తే ఏ హీరో గుర్తొస్తాడో చెప్పాలి" అనేసరికి "మిర్చి అంటే ప్రభాస్, ఫైర్ అంటే బాలయ్య" అని చెప్పింది. "చేసిన మూవీస్ లో మీ రోల్స్ నేమ్స్ చెప్పాలి" అని అడిగారు. "ఎస్ఎంఎస్ మూవీలో శృతి, పవర్ లో వైష్ణవి, పిల్లా నువ్వు లేని జీవితం మూవీలో సిరి అండ్ శైలజ" అని చెప్పింది. "ఇంకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు అనిపించే హీరోస్ ఎవరు" అనేసరికి "పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఇప్పటి వరకు నటించలేదు" అని చెప్పింది.

"మీ ఢీ షో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది" అని అడిగేసరికి "చాల ఫ్యాబులౌస్ గా ఉంది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్..ఇలా ఒక డాన్స్ రియాలిటీ షోకి ఒక జడ్జ్ గా చేయడం. నాకు చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పుడు క్లాసెస్ కి కూడా వెళ్లేదాన్ని. భరతనాట్యం నేర్చుకున్నా. ఇక ఇక్కడ కంటెస్టెంట్స్ చేసే డాన్స్ చూసాక వాళ్ళు పెట్టే ఫోకస్ కానీ, వాళ్ళు చూపించే పవర్ కానీ నాకు బాగా నచ్చుతుంది. ఇదేమంత ఈజీ జాబ్ కాదు. ఇదొక బ్రాండ్. ఇలాంటి ఒక బ్రాండ్ ఉన్న డాన్స్ షోలో నేను ఒక భాగం కావడం సంతోషంగా ఉంది" అని చెప్పింది. "ఢీ సెట్ లో బాగా ఫన్ చేసేది ఎవరు" అని అడిగేసరికి.." అందరూ ఫన్ చేస్తారు. ఆది, విజయ్ బిన్నీ మాస్టర్, నందు, కంటెస్టెంట్స్ అంతా" అని చెప్పింది.

"మీ మూవీస్ లో ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఏది" అని అడగగా.. "ఎవరు" మూవీ ఇష్టం అని చెప్పింది రెజీనా. "మీరు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నారు" అనే ప్రశ్నకు.. "మణిరత్నం గారు, రాజమౌళి గారితో వర్క్ చేయాలనీ ఉంది" అని చెప్పింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.