English | Telugu

చిరంజీవికి ఆప‌రేష‌న్ జరిగిందా?

మెగాస్టార్ చిరంజీవి ఆరు ప‌దుల వ‌య‌సు దాటినా కుర్ర హీరోల‌కు గ‌ట్టిపోటీనే ఇస్తున్నారు. వ‌రుస సినిమాలు చేయ‌ట‌మే కాదు, డాన్సులు, యాక్ష‌న్ స‌న్నివేశాల్లో నటించి మెప్పిస్తున్నారు. రీసెంట్‌గానే భోళా శంక‌ర్ సినిమాను పూర్తి చేసిన స‌తీమ‌ణి సురేఖ‌తో క‌లిసి అమెరికా వెళ్లి వ‌చ్చారు. వెకేష‌న్ వెళ్లి వ‌చ్చార‌ని అందరూ అనుకున్నారు. కానీ చిన్న ఆప‌రేష‌న్ కోసం వెళ్లిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అదేంటంటే, కొన్నాళ్లుగా ఆయ‌న మోకాళి నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. అందుక‌నే ఆయ‌న అమెరికా వెళ్లి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. అయితే ఇందులో టెన్ష‌న్ ప‌డేంత ఏమీ లేద‌ని, అమెరికా నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న న‌డుచుకుంటూనే వెళ్లారని నెటిజ‌న్స్ అంటున్నారు.

త్వ‌ర‌లోనే చిరంజీవి త‌న నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయ‌బోతున్నారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాను చిరంజీవి కుమార్తె సుష్మిత‌, అల్లుడు విష్ణు ప్ర‌సాద్‌ల‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ కూడా క‌లిసి నిర్మిచ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయ‌ని త్వ‌ర‌లోనే సినిమాను లాంఛ‌నంగా సెట్స్ పైకి తీసుకెళ్ల‌ట‌మే కాకుండా వెంట‌నే షూటింగ్‌ను స్టార్ట్ చేసేస్తార‌ని, ఇప్ప‌టికే ప్లానింగ్ పూర్తి కావ‌టంతో వీలైనంత త్వ‌ర‌గానే సినిమాను పూర్తి చేయాల‌నుకుంటున్నారు. అందుకు కార‌ణం.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి త‌న సినిమాను రిలీజ్ చేయాల‌ని చిరంజీవి భావిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంటే మ‌రో జంట కూడా సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.

మరో వైపు ఆగ‌స్ట్ 11న చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భోళా శంక‌ర్ సినిమా రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను రూపొందిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.