English | Telugu

ఎన్టీఆర్‌, ప‌వ‌న్ వ‌దిలేస్తే... చిరు ప‌ట్టుకొన్నాడు

చిరంజీవి 150వ సినిమాలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కూ చిరు 150వ సినిమా పూరి జ‌గ‌న్నాథ్‌తో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత వినాయ‌క్ రేసులోకి వ‌చ్చాడు. రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో అతిథి పాత్ర చేసి, 150వ సినిమా మైలురాయి అందుకొంటాడ‌ని చెప్పుకొన్నారు. ఇప్పుడు మ‌రో మ‌లుపొచ్చింది. చిరంజీవి ఓ త‌మిళ రీమేక్‌లో న‌టించ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని, అదే... చిరు 150వ సినిమా అవుతుంద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు ఓ న్యూస్ లీక్ చేశాయి.

విజ‌య్ న‌టించిన త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం `క‌త్తి`. ఈసినిమాని రీమేక్ చేయాల‌ని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ముందు ప‌వ‌న్‌కి ఈ క‌థ వినిపించారు. త‌ను సినిమా చూసి `నో` చెప్పాడు. ఎన్టీఆర్ కూడా ఈ రీమేక్ చేయ‌డానికి స‌ముఖ‌త చూపించ‌లేదు. ఇప్పుడు చిరంజీవి ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడ‌ని టాక్‌. క‌త్తి రీమేక్ హ‌క్కులు ఠాగూర్ మ‌ధు ద‌గ్గ‌ర ఉన్నాయి. మ‌ధుకీ, చిరుకీ మంచి సాన్నిహిత్యం ఉంది. మ‌ధు సినిమా అంటే అది చిరు ఓన్ బ్యాన‌ర్ లాంటిదే. అందుకే చిరు ఈసినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని తెలుస్తోంది.

భూసేక‌ర‌ణ‌, మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ క‌త్తి. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కీ ఈసినిమా బాగా హెల్ప్ అవుతుంద‌ని చిరు భావిస్తున్నాడ‌ట‌. చ‌ర‌ణ్‌సినిమాలో గెస్ట్ రోల్ చేసినా - ఈ క‌త్తి రీమేక్‌లో కూడా చిరు న‌టిస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈనెల 22న చిరు పుట్టిన రోజు. ఆ సంద‌న్భంగా త‌న 150వ సినిమా ఎవ‌రితో అనే విష‌యాన్ని చిరు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.