English | Telugu

మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం మొదటి సీజన్‌ ముగింపు ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఆ షో లో 150వ చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ 150వ చిత్రం ఎప్పుడు రాబోతుందంటూ చిరంజీవిని నాగ్ ప్రశ్నించగా... ఈ సంవత్సరం మొదలు కానుందని, వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కథలు వింటున్నానని, మనస్సుకు నచ్చే కథ దొరికిన వెంటనే సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు చిరు వెల్లడించారు. దీంతో చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు రిలీఫ్ దొరికింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.