English | Telugu

ఛార్మి డ‌బుల్ ధ‌మాకా

గ్లామ‌ర్ రోల్స్ అంటే గుర్తొచ్చే హీరోయిన్స్‌లో ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఒక‌రు. టాప్ హీరోల ప‌క్క‌న గ్లామ‌ర‌సాన్ని ఒలికిస్తూ ఆడిపాడినా.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూనే పెర్‌ఫార్మెన్స్‌ని చూపెట్టినా ఆమెని స‌క్సెస్‌లు బాగానే వ‌రించాయి. ఇదిలా ఉంటే.. ఈ అందాల తార కేవ‌లం వారం గ్యాప్‌లో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 12న పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన జ్యోతిల‌క్ష్మీతో ప‌ల‌క‌రించ‌నున్న ఈ సుంద‌రి.. జూన్ మూడో వారంలో మంత్ర 2తో ఆడియ‌న్స్ ముందుకు రానుంది. ఓ హీరోయిన్ న‌టించిన రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంలో పెద్ద విశేష‌మేమిలేదు కానీ.. ఆ రెండు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కావ‌డంతోనే ఛార్మి వార్త‌ల్లో నిలుస్తోంది. ఆల్ ది బెస్ట్ ఛార్మి!

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.