English | Telugu

ఏప్రిల్ 25న చందమామ

నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన తాజా చిత్రం "చందమామ కథలు". ఈ చిత్రాన్ని ఈనెల 14న విడుదల చేయాలని అనుకున్నారు కానీ మళ్ళీ ఈ సినిమాను వాయిదా వేసారు. ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఎనిమిది విభిన్న కథలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చక్రి బూనేటి నిర్మించారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.