English | Telugu

నానికి అందని ద్రాక్షలా మారిన విజయ్ రికార్డు!

టాలీవుడ్ యూత్ స్టార్స్ లో టాప్-2 ఎవరంటే నాని (Nani), విజయ దేవరకొండ (Vijay Deverakonda) పేర్లు చెబుతారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాది, సినిమాల సంఖ్య, విజయాల పరంగా చూస్తే.. విజయ్ కంటే నాని చాలా ముందున్నాడు. అలాగే ప్రస్తుతం విజయ్ వరుస ఫ్లాప్స్ లో ఉండగా.. నాని మాత్రం 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా అన్నింట్లోనూ ముందున్న నాని.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయాడు.

టైర్ 2 స్టార్స్ లో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా విజయ్ దే. విజయ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'గీత గోవిందం' 2018లో విడుదలై రూ.130 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా వచ్చి ఏడేళ్ళవుతున్నా ఇంతవరకు ఈ రికార్డుని నాని బ్రేక్ చేయలేకపోయాడు. 2023లో వచ్చిన 'దసరా'తో నాని ఈ రికార్డు బ్రేక్ చేస్తాడని భావించారంతా. ఆ అంచనాలకు తగ్గట్టే రికార్డు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఫుల్ రన్ లో రూ.120 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. మరో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లయితే.. 'గీత గోవిందం' రికార్డు బ్రేక్ అయ్యి ఉండేది.

'దసరా' తర్వాత 'హాయ్ నాన్న' అనే క్లాస్ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించాడు నాని. ఇది రూ.75 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకుంది. అనంతరం 'సరిపోదా శనివారం' అనే మరో మాస్ సినిమాతో వచ్చి, మరోసారి రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాడు. కానీ ఫుల్ రన్ లో ఇది దసరాను కూడా క్రాస్ చేయలేకపోయింది. ఇప్పుడు హిట్-3 పై అందరి దృష్టి పడింది.

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హిట్-3'. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. 'హిట్-3'పై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా నాని మునుపెన్నడూ లేనంత వయలెంట్ గా కనిపిస్తున్నాడు. 'హిట్-3'తో మరో రూ.100 కోట్ల సినిమా.. నాని ఖాతాలో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాతోనైనా నాని 'గీత గోవిందం' రికార్డుని బ్రేక్ చేస్తాడా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు 'గీత గోవిందం' రికార్డుని విజయ్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఈ ఏడేళ్ళలో విజయ్ నుంచి ఏడు సినిమాలు రాగా, అందులో ఒకటి కూడా వంద కోట్ల క్లబ్ లో చేరలేదు. విజయ్ తన నెక్స్ట్ మూవీ 'కింగ్ డమ్'తో కమ్ బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.