English | Telugu

ఉగ్రదాడిపై పవన్ కళ్యాణ్ ట్వీట్.. జమ్మూ కాశ్మీర్ అందుకు రెడీగా ఉండాలి

జమ్మూకాశ్మీర్‌(Jammu Kashmir)అనంత్‌నాగ్(Ananth Nag)ప్రాంతంలోని పహల్గామ్‌(Pahalgam)లో ఉగ్రవాదులు దాడి జరిపి అమాయకులైన 28 మంది టూరిస్ట్ లని చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇరవై మంది గాయపడ్డారు. జరిగిన ఈ దారుణంపై పవన్ కళ్యాణ్(Pawan Kalyan)స్పందించడం జరిగింది.

ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేస్తు 'ఉగ్రవాద దాడి వార్త నన్ను తీవ్రంగా బాధించింది. పహల్గామ్‌ ని 'మినీ స్విట్జర్లాండ్" అని పిలుస్తారు. 27 మంది అమాయక పర్యాటకులు మరణించడం,20 మంది గాయపడటం చాలా భయంకరమైనది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ(Narendra Modi)నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని రూపాల్లో నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి .

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారు కేంద్ర దళాలతో పూర్తి సమన్వయాన్ని నిర్ధారించుకోవాలని, పర్యాటకులు, స్థానిక పౌరుల ప్రాణాలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఉగ్రవాద ముప్పులను తొలగించడంతో పాటు జాతీయ భద్రతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాత్మక చర్యకైనా దేశంలోని పౌరులందరు పూర్తి మద్దతు ఇస్తారంటు ట్వీట్ చేసాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం