English | Telugu

పుష్ప 2 పై పోలీసు కేసు

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)ప్రస్తుతం పుష్ప పార్ట్ 2(pushpa 2)కి సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 5 డేట్ దగ్గర పడుతుండతంతో క్షణం తీరిక కూడా లేకుండా
పాట్నా లో జరిగిన ఈవెంట్ దగ్గరనుంచి వరుసగా చెన్నై,కేరళ,ముంబై వేదికగా జరిగిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తున్నాడు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన అభిమానులని ఉద్దేశిస్తూ నాకు అల్లు అర్జున్ ఆర్మీ అని సంబోధించడం జరుగుతుంది.ఇప్పుడు ఈ విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ జవహర్ నగర్ పి ఎస్ లో గ్రీన్ పీస్ సంస్థ అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి ఆర్మీ అని పెట్టుకోవడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ కోరుతున్నారు. ఒక వేళ అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరు తొలగించి క్షమాపణ చెప్తే కంప్లంట్ ని వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ చెప్తుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.