English | Telugu

మెగాస్టార్ తో పోటీకి దిగుతున్న అఖిల్ అక్కినేని!

ఇటీవల 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ మెగా కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రం 'భోళా శంకర్'పై అంచనాలు పెరిగిపోయాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి పోటీగా అక్కినేని అఖిల్ చిత్రం విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఏజెంట్'. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ ఫిల్మ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే ఏప్రిల్ 14 డేట్ ని 'భోళా శంకర్' లాక్ చేసుకుంది. మరి ఆ సినిమా ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో 'ఏజెంట్'ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారా లేక పోటీకి సిద్ధపడే బరిలోకి దింపుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

పైగా ఈ రెండు చిత్రాలు ఒకే బ్యానర్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతుండటం విశేషం. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సైతం తాము నిర్మించిన రెండు బడా సినిమాలు 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి'లను ఒకేసారి విడుదల చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సైతం అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.