English | Telugu

బండ్ల గ‌ణేష్‌పై 420 కేసు..

బండ్ల గ‌ణేష్‌పై చీటింగ్ కేసు న‌మోద‌య్యింది. అదీ.. ఓ హీరో సంస్థ త‌ర‌ఫునుంచి. స‌చిన్ జోషీతో నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ రాసుకుపూసుకొని తిరిగాడు బండ్ల గ‌ణేష్. టెంప‌ర్ సినిమాకి బ‌య‌ట నుంచి డ‌బ్బులు పెట్టింది స‌చినే. నీ జ‌త‌గా నేనుండాలి సినిమాకీ గ‌ణేష్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నాడు. అయితే ఆ డ‌బ్బులూ స‌చిన్‌వే. ఆ సినిమా విషయంలో గ‌ణేష్ త‌న‌ని మోసం చేశాడ‌ని, స‌చిన్ నిర్మాణ సంస్థ అయిన విల్‌కింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ గ‌ణేష్ పై చీటింగ్‌కేసు న‌మోదు చేసింది.

ఆ సినిమాకి సంబంధించిన డ‌బ్బులు చెల్లింపు విష‌యంలో త‌న‌ని మోసం చేశాడ‌ని ఆరోపిస్తున్నాడు స‌చిన్ జోషి. టెంప‌ర్ విష‌యంలోనూ గ‌ణేష్‌.. స‌చిన్‌ని బాగా మ‌భ్య‌పెట్టిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. లాభాల్లో వాటా ఇస్తాన‌ని చెప్పి... చివ‌రికి న‌ష్టాలొచ్చాయ‌ని త‌ప్పుడు లెక్క‌లు చూపించిన‌ట్టు తెలుస్తోంది.

అందుకే.. స‌చిన్ గ‌ణేష్‌పై గుర్రుగా ఉన్న‌ట్టు వినికిడి. ఈ విష‌యంపై స‌చిన్ - గ‌ణేష్ ల మ‌ధ్య ప‌లుద‌ఫాలుగా చ‌ర్చ‌లు సాగినా.. గ‌ణేష్ డ‌బ్బులు ఇవ్వ‌డానికి నిరాక‌రించిన‌ట్టు తెలుస్తోంది. దాంతో చివ‌రి అస్త్రంగా గ‌ణేష్‌పై చీటింగ్ కేసు పెట్టేశాడు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో, చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.