English | Telugu

రుద్ర‌మ‌దేవిని టెన్ష‌న్ పెడుతున్న బాహుబ‌లి

అనుకొన్న‌ట్టే రుద్ర‌మ‌దేవి వాయిదా ప‌డింది. ఈనెల 26న రావట్లేదు. ఎప్పుడ‌న్న‌ది గుణ‌శేఖ‌ర్ ఇంకా తేల్చ‌లేదు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో ఆల‌స్యం అవుతుంద‌ని గుణ‌శేఖ‌ర్ చెబుతున్నా.. అస‌లు కార‌ణాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా చూసిన బ‌య్య‌ర్లు పెద‌వి విరిచార‌ని టాక్‌. నిడివి ఎక్కువ‌గా ఉంద‌ని, విజువ‌ల్ ఎఫెక్ట్స్ అంత‌గా ర‌క్తిక‌ట్ట‌లేద‌ని లూప్ హోల్స్ బ‌య‌ట‌పెట్టార‌ట‌. రూ.60 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని చెబుతున్నా అది తెర‌పై క‌నిపించ‌డం లేద‌ని గుణ‌శేఖ‌ర్‌కి ఫీడ్ బ్యాక్ ఇచ్చార‌ట‌.

దాంతో... గుణ‌శేఖ‌ర్ డైలామాలో ప‌డిన‌ట్టు టాక్‌. ఇప్ప‌టికిప్పుడు మ‌ళ్లీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ మార్చాంటే కుద‌ర‌దు. అందుకే కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ మార్చి చూడాల‌ని గుణ‌శేఖ‌ర్ నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌. దాంతోపాటు ఈ సినిమాని ఎక్క‌డెక్క‌డ ట్రిమ్ చేస్తే బాగుంటుందో త‌న టీమ్‌తో స‌హా చ‌ర్చిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రుద్ర‌మ‌దేవి ప‌లుసార్లు వాయిదా ప‌డింది. దాంతో ఈ సినిమాపై ఏమాత్రం క్రేజ్ ఉన్నా.. అది కూడా మెల్లిమెల్లిగా స‌న్న‌గిల్లుతోంది.

బాహుబ‌లి విడుద‌ల‌య్యాక రుద్ర‌మ‌దేవిని విడుద‌ల చేస్తే.. ఈ రెండు సినిమాల‌కూ జ‌నాలు పోలిక‌లు తీస్తార‌ని, అప్పుడు రుద్ర‌మ‌దేవి తేలిపోతుంద‌ని భ‌య‌ప‌డ్డాడు గుణ‌శేఖ‌ర్‌. ఇప్పుడు ఆ భ‌యాలే నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ 26 దాటితో రుద్ర‌మ‌దేవికి అనువైన స్లాట్ దొర‌క‌డం క‌ష్టం. ఈలోగా బాహుబ‌లి విడుద‌ల అయిపోతుంది కూడా. ఈలోగా రుద్ర‌మ‌దేవికి ఇంకాస్త మెరుగులు దిద్ది విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నాడు గుణ‌శేఖ‌ర్‌. అందుకోసం మ‌రో నాలుగైదు కోట్ల ఖ‌ర్చు ఎక్కువైనా వెన‌క‌డుగు వేయ‌కూడ‌ద‌నుకొంటున్నాడ‌ట‌. మొత్తానికి బాహుబ‌లి రుద్ర‌మ‌దేవిని బాగానే టెన్ష‌న్ పెడుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.