English | Telugu

దేవికి లెజెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట...!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య "లెజెండ్" సినిమా ఫస్ట్ లుక్, స్మాల్ టీజర్ ఇటీవలే విడుదలయ్యాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు నేడు సాయంత్రం శిల్పకళావేదికలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ వేదిక దగ్గర భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకలో దేవిశ్రీప్రసాద్ స్పెషల్ షో చేయబోతున్నాడని తెలిసింది.

దేవి సంగీతం అందించిన ప్రతి సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో తన హుషారైన పాటలతో అభిమానులను, ప్రేక్షకులను సినిమా ఆడియోపైన ఉండే అంచలను మించకుండా ఆడి,పాడి ఉత్సాహపరిచేవాడు. అయితే బాలయ్య సినిమాకు దేవి మొదటిసారిగా సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ ఆడియో వేడుకలో దేవికి బాలయ్య ఉత్సాహపరిచే విధంగా రచ్చ రచ్చ చేసి అభిమానులను అలరించు అనే విధంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తెలిసింది. ఇక దేవి కూడా స్టేజ్ మీద అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడని తెలిసింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 28న లేదా ఏప్రిల్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.