English | Telugu

బాలయ్య లెటర్ పై యన్ టి ఆర్ అసంతృప్తి

బాలయ్య లెటర్ పై యన్ టి ఆర్ అసంతృప్తిగా ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే ఈ మధ్య యువరత్న నందమూరి బాలకృష్ణ పార్టీ వ్యవహారాలతో ప్రస్తుతం తనకేమీ సంబంధం లేదని మీడియాకు ఒక లేటర్ విడుదల చేశారు. విజయవాడ నగర అధ్యక్షులు వల్లభనేని వంశీ మోహన్ కీ, దేవినేని ఉమకూ మధ్య జరుగుతున్న గొడవల గురించి బాలకృష్ణ ఈ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో తమను ప్రచారానికి పిలిచిన బాబాయ్ ఇప్పుడిలా "నాకేం సంబంధం లేదని తప్పుకోవటం బాధ కలిగించిందని" యన్ టి ఆర్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. యన్ టి ఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా ఈ విషయంపై కాస్త కోపంగానే ఉన్నట్లు సమాచారం.

అసలీ గొడవంతా తెలుగుదేశం పార్టీ పగ్గాలను భవిష్యత్తులో తన ఏకైక కుమారరత్నం నారా లోకేష్ కి అప్పగించే ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారనీ, దానికి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు గారి నందమూరి వారసులకు మాత్రమే తెలుగు దేశం పార్టీ పగ్గాలు దక్కాలని తెలుగు దేశం పార్టీలో ఒక వర్గం తెగించటం వల్లే ఈ ఘరషణ తలెత్తిందనీ అనుకుంటున్నారు. వంశీ మోహన్, కొడాలి నాని నందమూరి కుటుంబానికి విధేయులు. నందమూరి కుటుంబానికి అవమానం జరగటం వల్లే తాము ఇలా రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు. ఇదిలా ఆగితే ఫరవాలేదు.చిలికి చిలికి గాలివానగా మారితే తెలుగు దేశం ముక్కలు చెక్కలవటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.