English | Telugu

నిర్మాతలతో బాలయ్య, బోయపాటి భేటీ.. రిలీజ్ పై మరికాసేపట్లో ప్రకటన

బాలయ్య, బోయపాటి భేటీ
ఏం మాట్లాడారు
రిలీజ్ ఎప్పుడు!


బాలయ్య(Balakrishna),బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబోకి ఉన్నక్రేజ్ కి కొలమానాలు లేవు. ఆ ఇద్దరి కాంబోలో సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు. భారీ అభిమాన గణం కూడా ఆ ఇద్దరి కాంబో సొంతం. దీన్ని బట్టి ఆ ఇద్దరి ప్రీవియస్ చిత్రాలు ఎంతగా ప్రభావం చూపించాయో అర్ధం చేసుకోవచ్చు. దీంతో అఖండ 2(Akhanda 2)కోసం అందరు ఎంతో ఆశతో ఎదురుచూసారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా నిన్న ప్రీమియర్స్ కి వెళ్లకపోవడంతో పాటు ఈ రోజు ఇంకా థియేటర్స్ లో అడుగుపెట్టలేదు.


ఈ నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటి అఖండ 2 నిర్మాతలైన ఆచంట గోపినాధ్, రామ్ లతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో రిలీజ్ కి ఏర్పడిన ఆటంకాలని తొలగించబోతున్నట్టుగా సమాచారం. దీంతో మరికాసేపట్లో రిలీజ్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా టాక్. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ తో అభిమానులు సంతోషంగా ఉన్నారు.

Also Read:ప్రాబ్లమ్స్ క్లియర్.. క్లారిటీ వచ్చిన అఖండ 2 షోస్ డిటైల్స్ ఇవే

అదే సమయంలో వాళ్ళు స్పందిస్తు ఈ రోజు రాత్రి నుంచైనా బెనిఫిట్ షోస్ ప్రదర్శించేలా చూడాలని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా రిలీజ్ టైం విషయంలో సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా బాలయ్య, బోయపాటి లని కోరుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.