English | Telugu

తెలుగు హీరోయిన్‌‌కి కోలీవుడ్‌ కష్టాలు


కష్టజీవి శ్రీదివ్యకు కొత్త కష్టం వచ్చింది. బాలనటిగా ప్రిన్స్ మహేష్ సినిమాలో నటించిన తెలుగమ్మాయి శ్రీదివ్యకు కోలీవుడ్ లో ప్రస్తుతం చాలా అవకాశాలున్నాయి. తెలుగులో మల్లెలతీరం, బస్‌స్టాప్ చిత్రాల్లో నటించిన శ్రీదివ్యకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కిన శ్రీదివ్వ తమిళ పరిశ్రమలో మంచి ఛాన్స్ లు వచ్చాయి. పెన్సిల్, ఈటి, తాణా ఇలా వరుసగా ఒకే ఏడాదిలో 7 సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో టాప్ హీరోల పక్కన కూడా శ్రీదివ్యకు అవకాశాలు వస్తున్నాయి. పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయంలోనే విశాల్, విక్రమ్, ప్రభూ, జీవా వంటి హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది.


ఇలా 7 సినిమాలతో బిజీగా వున్న శ్రీదివ్యపై అక్కడి మీడియాలో కొత్త కథనాలు మొదలయ్యాయి. శ్రీదివ్య రెమ్యూనరేషన్ పెంచింది, దర్శకులను, నిర్మాతలను సతాయిస్తోంది, యూనిట్‌కి చుక్కలు చూపిస్తోంది అంటూ టాకు మొదలైందట. కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం చూసి శ్రీదివ్య షాకుకు గురైందట. ఆపై, "అవన్నీ నా మీద వస్తున్న పుకార్లే, ప్లీజ్ వాటిని నమ్మకండి" అంటూ ప్రకటన ఇచ్చిందట. సిన్సియర్ గా పనిచేసుకుంటున్న తనపై ఇలాంటి రూమర్లు రావటం ఎంతో ఆశ్చర్యంగా వుందంటోంది శ్రీదివ్య.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.